సంక్షేపరామాయణమ్
సమః సమవిభక్తాఙ్గః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ ।
పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాఞ్ఛుభలక్షణః ॥ ౧౧॥
ఆ శ్రీ రాముని శరీరము పొట్టిగా కాని, పొడవైనదిగా కాని లేదు. అతని అవయవములు అన్నియు హెచ్చుతగ్గులు లేక సరిగా విభజింపబడి ఉన్నవి. శరీరపు చాయ చాల చక్కనిది. తెజ్జస్సు చాలా ప్రశంసనీయమైనదుఇ. వక్షఃస్థలము బలిసి ఉండును. నేత్రములు విశాలమైనవి. అవయవముల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణము లన్నియు అతని శరీరము నందున్నవి.
ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ ప్రజానాం చ హితే రతః ।
యశస్వీ జ్ఞానసమ్పన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ॥ ౧౨॥
శ్రీరాముడు శరణాగతరక్షణాది ధర్మములు బాగుగా తెలిసినవాడు, చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొనును. ప్రజల హితమునకై ఎక్కువ ఆసక్తి చోపును. అన్ని విషయములను తెలిసినవాడు, పరిశిద్ధమైనవాడు, అనగా నిజాయతీ కలవాడు, గురుజనులకు లొంగి ఉండువాడు, ఆశ్రితులకు అందుబాటులో ఉండువాడు, ఆశ్రితులను రక్షించుటకై దీక్షవహించినవాడు.
ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః ।
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ॥ ౧౩॥
శ్రీరాముడు బ్రహ్మతో సమాననుడు. అందరిని మించినవాడు. సర్వలోకములను పోషించువాడు. శత్రువులను నశింపచేయువాడు. సమస్తప్రపంచమును రక్షించువాడు. ధర్మమును బాగుగా రక్షించువాడు.
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ।
వేదవేదాఙ్గతత్త్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ॥ ౧౪॥
శ్రీరాముడు తనధర్మమును చక్కగ పాటించుచు తనవారి నందరిని రక్షించుచుండును. వేదవేదాంగముల రహస్యములన్నియు ఈతనికి తెలియును. ధనుర్వేదమునందు ఈతనికున్న జ్ఞానము అసాధారణమైనది.
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞః స్మృతిమాన్ప్రతిభానవాన్ ।
సర్వలోకప్రియః సాధురదీనాత్మా విచక్షణః ॥ ౧౫॥
రాముదు వెనుక చెప్పిన వేదవేదాంగములే కాక మిగిలిన ధర్మశాస్త్ర-పురాణ-న్యాయ-మీమాంసా-సాంఖ్య-వైశేషిక-యోగశాస్త్రముల అభిప్రాయములను, సిద్ధాంతములనుబాగుగా తెలిసికొనినవాడు. తెలిసికొన్న విషయములను ఎన్నడును మరువడు. లోకవ్యవహారములలో ఈతనికి గల ఉత్తరోత్తరయుక్తుల స్ఫురనమ్ గొప్పది. సమస్త జనులయందును ఈతనికి ప్రేమ అధికము. ఆ జనులకు కూడా రాముడనిన ప్రాణము. ఎట్టి కష్టకాలమునందైనను ఈతని మన్అస్సు కలత చెందదు. వినివారికి ఆనందము కలుగుఇ నట్లు భాషణ చేయుట యందును, సమయోచితములగు కార్యములను నిరహించుటయందును గొప్పనేర్పు కలవాడు.
సర్వదాఽభిగతః సద్భిః సముద్ర ఇవ సిన్ధుభిః ।
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః ॥ ౧౬॥
నదులు ఎల్లపుడును, అనగా మూడు కాలములందును, సముద్రమును చేరుచుండు నట్లు సత్పురుషులు ఎల్లవేళల రామునివద్దకు వచ్చుచుండురు. ఈతడు ప్రతి ఒక్కరును దగ్గరకు చేరవలసిన వ్యక్తి. పూజనీయుడు. అందరి విషయమునను సమముగా ప్రవర్తించువాడు. ఈతని దర్శనము ఎల్లపుడును ఒకే విధముగ ఆనందజనకముగా ఉండును.
స చ సర్వగుణోపేతః కౌసల్యానన్దవర్ధనః ।
సముద్ర ఇవ గామ్భీర్యే ధైర్యేణ హిమవానివ ॥ ౧౭॥
కౌసల్యకు ఆనందమును వృద్దిపొందించు ఆ రాముడే సకలగుణ ములతో కూడినవాడు. అతడు గాంభీర్యమునందు సముద్రమువంటివాడు. దైర్యమునందు హిమవత్పర్వతము వంటివాడు.
విష్ణునా సదృశో వీర్యే సోమవత్ప్రియదర్శనః ।
కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ||
ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః ||౧౮||
రాముడు పరాక్రమునందు విష్ణువుతో సమానుడు. చంద్రదర్శనము వలె ఈతని దర్శనము ఆనందకరము. కోపము వచ్చినప్పుడు ప్రలయకాలాగ్ని వలె చాల భయంజరమైనవాడు. ఓర్పులో భూమివంటివాడు. ఇతరులకు దానముచేయుటలో కుబేరునివంటివాడు. సత్యమును సంరక్షించు విషయమున ధర్మదేవత వంటివాడు. ఈ విషయమున ఈతనిని మించినవారెవరును లేరు.
తమేవఙ్గుణసమ్పన్నం రామం సత్యపరాక్రమమ్ ॥ ౧౯॥
జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథః సుతమ్ ।
ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతిప్రియకామ్యయా ॥ ౨౦॥
యౌవరాజ్యేన సంయోక్తుమైచ్ఛత్ప్రీత్యా మహీపతిః ।
దశరథమహారాజు ప్రజలకు హితము చేయవలెనను కోరికతో, సమస్తసద్గుణసంపన్నుడును, అమోఘములగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజాహితమే కోరుచుండువడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్ఠకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను.
ValmikiRamayana SamkshepaRamayanam(11-20)
ఈ తాత్పర్యములు ఆర్షవిజ్ఞానట్రస్టువారి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెలశ్రీరామచంద్రుడు గారిచే రచించబడిన శ్రీ మద్రామాయణము-బాలకాండము గ్రన్థమునుండి కృతజ్ఞతా పురస్కరముగా తీసుకొనబడినవి.