గ్రామ కుంకుమ నోము కథ
ఒక బ్రాహ్మణునకు ప్రాణగండముండెను. అతని భార్య గ్రామకుంకుమ నోము నోచి యధావిధిగా పండ్లు పసుపు, కుంకుమ పట్టుకొని వీధివీధుల పంచిపెట్టసాగెను. ఆమె మొదట వీధిలో పంచిపెట్టునంతలో పెద్దకొడుకు వచ్చి తండ్రికి జబ్బుగానున్నదని తెలుపగా ఆమె ఇంకో వీధి యున్నదని చెప్పెను. ఆమె రెండవ వీధిలోపంచిపెట్టుచొండగా రెండవ కొడుకు వచ్చి రోగము ముదిరిపోయిందని చెప్పెను, ఆమె ఇంకొక వీధి యున్నదని చెప్పి మూడవ వీధిలో పంచిపెట్టుచుండగా మూడవకొడుకు వచ్చి తండ్రికి ప్రాణంమీదకి వచ్చెననిచెప్పెను అప్పుడామె ఇంకొకవీధి మాత్రమున్నదని చెప్పి నాల్గవవీధిలో పంచిపెట్టుచుండగా నాలుగవకొడుకొచ్చి తండ్రిని క్రింద పెట్టినట్లు చెప్పెను ఆమె ఇంకొక వీధిమాత్రమున్నదని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టుచుండగా అయిదవ కొడుకు వచ్చి చనిపోయినట్లు చెప్పెను గాని ఆమె వీధి అంతకు పంచిపెట్టువరకు ఇంటికి వెళ్ళలేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చిన మగడు బ్రతికి లేచి కూర్చుండెను. యది చూచి అందరూ యది గ్రామ కుంకుమ నోము శుభమనియెంచి నాటినుండి ఆ నోము నోచుకొనుచుండిరి.
ఉద్యాపన:
పసుపు కుంకుమలు వీసె యేబులము చొప్పున పండ్లతో కలిపి గ్రామములో పంచిపెట్టవలెను.
Grama Kumkuma Nomu